News March 18, 2025

NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

image

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.

Similar News

News November 25, 2025

అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

image

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.

News November 25, 2025

తిరుపతి జిల్లా విభజన ఇలా..!

image

తిరుపతి జిల్లా స్వరూపం మారనున్నట్లు తెలుస్తోంది. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోకి కలపనున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, వడమాలపేట ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాయి. నిండ్ర, విజయపురం, నగరి చిత్తూరు పరిధిలో ఉండగా వాటిని తిరుపతి జిల్లాలోకి చేరుస్తారని సమాచారం. నెల్లూరులోకి గూడూరు వెళ్తే.. వెంకటగిరి, బాలాయపల్లె, డక్కిలి మండలాలను శ్రీకాళహస్తి డివిజన్‌లో కలపనున్నారు.

News November 25, 2025

ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

image

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.