News March 18, 2025

NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

image

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.

Similar News

News November 16, 2025

కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 16, 2025

వనపర్తి: న్యాయ సాధన దీక్ష చేపట్టిన బీసీలు

image

బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని ఇది బీసీల హక్కని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు అన్నారు. పట్టణంలోని మర్రికుంట ధర్నాచౌక్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, BC JAC ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యుల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.

News November 16, 2025

MBNR:U-14..18న వాలీబాల్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 18న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్‌ జిరాక్స్ లతో ఉ.9:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.