News March 18, 2025
NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.
Similar News
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News November 5, 2025
రామగుండం: ముడి సరుకుల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

రామగుండం ఐటీఐలో వివిధ ట్రేడ్స్లో అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకు రూ.6.48 లక్షల వ్యయంతో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఈ.సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 196 రకాల ముడి సరుకులు ఒకే ప్యాకేజీగా సరఫరా చేయడానికి ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు రామగుండం ఐటీఐ ప్రిన్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.


