News March 18, 2025

NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

image

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.

Similar News

News November 15, 2025

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.

News November 15, 2025

పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రతి అధికారికి రెండు పాఠశాలలు కేటాయించి, పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. వినియోగంలో లేని ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల వివరాలను నవంబర్ 22లోపు పూర్తిచేయాలని సూచించారు. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.