News March 11, 2025
NRPT: ‘భూముల సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలి’

భూములకు సంబంధించిన సివిల్ కేసులు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మొత్తం 09 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ చెప్పారు.
Similar News
News October 14, 2025
16న గండిక్షేత్రంలో వేలం

చక్రాయపేట మండలం గండిక్షేత్రం శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయల విక్రయాలు, వివాహాలు జరిపించడం, ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ సప్లయర్స్కు సంబంధించి వేలం జరుగుతుంది. ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహిస్తారు.
News October 14, 2025
BREAKING: HYD: మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మసీదు వద్ద ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలోని మసీదు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేయాలని ప్రభావితం చేశారని పేర్కొన్నారు. సునీతను A1, అక్షరను A2గా, మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
News October 14, 2025
BREAKING: HYD: మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మసీదు వద్ద ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలోని మసీదు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేయాలని ప్రభావితం చేశారని పేర్కొన్నారు. సునీతను A1, అక్షరను A2గా, మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.