News January 29, 2025

NRPT: ‘భూసేకరణ పనులలో వేగం పెంచాలి’

image

భూసేకరణ, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో జిల్లాలో భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో కోయిల్ సాగర్, కొడంగల్ నారాయణపేట, భీమా ప్రాజెక్టు భూసేకరణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణ మండలంలో భీమ ప్రాజెక్టు కింద 45.34 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2025

సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

News February 14, 2025

RCB: కొత్త కెప్టెన్.. కొత్త ఆశలు.. కొత్త కలలు..

image

ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్ రాకతో ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన ట్రోఫీని పాటిదార్ సారథ్యంలో దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాగా RCBకి ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లుగా (ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, వాట్సన్, డుప్లెసిస్) చేశారు. వారిలో ఏ ఒక్కరు ఆ జట్టుకు కప్‌ను అందించలేకపోయారు.

News February 14, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలుత అరెస్టైన ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసీఆర్ హయాంలో ఇతడు SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని, ఆధారాలను ధ్వంసం చేశారని పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.

error: Content is protected !!