News March 22, 2025
NRPT: భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి: కలెక్టర్

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉట్కూర్ మండలంలోని దంతన్పల్లి గ్రామంలో భూసేకరణను నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
EPFO గుడ్న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ

EPFOలో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా యాక్టివ్గా లేని ఖాతాల్లోని డబ్బును చందాదారులకు ఇవ్వనుంది. 31.86 లక్షల ఇనాక్టివ్ ఖాతాల్లో ₹10,903 కోట్లున్నాయి. తొలి దశలో ₹1000 లోపు బ్యాలెన్స్ ఉన్న 7L అకౌంట్లలో పైలట్ ప్రాజెక్టుగా ఆ మొత్తాన్ని జమ చేయనుంది. తర్వాత మిగతా ఖాతాల్లో రిఫండ్ చేయనుంది. మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను ఇనాక్టివ్గా పరిగణిస్తారు.
News February 23, 2026
పెద్దపల్లి: ‘కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో ఎంఓయూ’

జిల్లాలో సి.ఎస్.ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యాభివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎం.ఓ.యు (MoU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా అమలు చేయనున్నారు. సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
News February 23, 2026
KMR: జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్

భౌతిక రసాయ శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. DEO రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు టాలెంట్ టెస్ట్లు ఉపయోగపడతాయన్నారు. టాలెంట్ పరీక్షలో ఆరాధ్య (ZPHS, రాజంపేట), శ్రేయాస్ (తెలంగాణ మైనార్టీ స్కూల్, మేనూర్) ప్రథమ స్థానంలో నిలిచారని ఫోరం అధ్యక్షులు తెలిపారు.


