News March 22, 2025

NRPT: భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి: కలెక్టర్

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉట్కూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో భూసేకరణను నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

image

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 24, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

News November 24, 2025

బాపట్ల: మాంసం దుకాణాల్లో మోసాలు..!

image

బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడులోని మాంసం దుకాణాలను తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో కాటాలకు సరైన ముద్రలు లేనట్లు గుర్తించారు. వారికి రూ.9 వేలు ఫైన్ వేశారు. కొలతల్లో లోపాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు కచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందజేయాలని ఆదేశించారు. మీ దగ్గర తూకాల్లో మోసం జరుగుతుందా? కామెంట్ చేయండి.