News March 6, 2025

NRPT: ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’

image

నారాయణపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించినట్లు నషా ముక్త్ భారత్ వాలంటీర్లు లక్ష్మీకాంత్, సంధ్య తెలిపారు. గంజాయి, డ్రగ్స్, కొకైన్ తదితర మత్తు పదార్థాలు వాడడం ద్వారా కలిగే నష్టాలు, అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోకూడదని సూచించారు.

Similar News

News November 22, 2025

జగిత్యాల అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతలు

image

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరిన అనంతరం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పోలీసు వ్యవస్థలో చైతన్యం నెలకొనున్నదని అధికారులు పేర్కొన్నారు.

News November 22, 2025

ఏలూరులో కాలువలో దూకిన మహిళ

image

ఏలూరు పవర్‌పేటకు చెందిన పూడి ఎర్రయ్య శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని అతని భార్య నారాయణమ్మ మధ్యాహ్న సమయంలో తంగెళ్లమూడి వంతెన పైనుంచి తమ్మిలేరులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 22, 2025

మెట్‌పల్లి: ‘నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి’

image

ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని MLC అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్‌పల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. జిల్లా BJP అధ్యక్షుడు యాదగిరి బాబు, రఘు, రమేష్, రాజేందర్ తదితరులున్నారు.