News February 12, 2025

NRPT: మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

మన్యంకొండ జాతర సందర్భంగా నారాయణపేట బస్ డిపో నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి (బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు భక్తుల సౌకర్యం కొరకు బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్ సర్వీసులను పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News December 3, 2025

VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

image

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

News December 3, 2025

ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదు: బాపట్ల కలెక్టర్

image

పాఠశాలలకు మంజూరైన పరికరాలు, ఆట వస్తువులన్నింటిని పీటీఎం కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పీటీఎంకు ఆహ్వానించాలన్నారు. ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదన్నారు. పదో తరగతి పరీక్షల్లో 100శాతం విద్యార్థుల ఉత్తీర్ణత ఉండాలన్నారు. విద్యార్థుల సామర్థ్యం గుర్తించే సమయంలో నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలని, అపార్ ఐడీ నూరు శాతం నవీకరణ చేయాలన్నారు.

News December 3, 2025

ఖమ్మం: ఎన్నికల లెక్క తప్పితే వేటు తప్పదు..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచికి రూ.2.5 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.