News February 4, 2025

NRPT: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 4, 2025

అందోల్: క్యాన్సర్ నియంత్రణపై దృష్టి: మంత్రి

image

క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును ప్రారంభదశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీని పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

News February 4, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా: కడప ఎస్పీ

image

జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News February 4, 2025

నందిగామ మున్సిపల్ ఎన్నిక జరిగిందిలా..

image

నందిగామలో 3 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై MLA సౌమ్య, MP చిన్ని ప్రతిపాదించిన పేర్లు కాకుండా అధిష్ఠానం మండవ కృష్ణకుమారి పేరు తెచ్చింది. ఏకగ్రీవం అనుకున్న ఓటింగ్‌‌కి YCP అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. దీంతో ఓటింగ్ తప్పలేదు. TDPకి 15, YCPకి 3 ఓట్లు పడడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 2020లో YCPకి 13 మంది బలం ఉండగా ఇప్పుడు 3కే పరిమితమవడం గమనార్హం.

error: Content is protected !!