News March 16, 2025
NRPT: ‘మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం’

మహిళలకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా షీ టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆకతాయిలు నుంచి మహిళలకు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గృహహింస, మానసికంగా వేధింపుల, అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
Similar News
News December 22, 2025
తిరుపతి జిల్లాలో SIల బదిలీ

తిరుపతి జిల్లాలో 18మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వులు ఇచ్చారు.
స్వాతి: అలిపిరి TO శ్రీకాళహస్తి వన్ టౌన్
జగన్నాథరెడ్డి: తిరుచానూరు TO మహిళా పీఎస్
సాయినాథ చౌదరి: సీసీఎస్ TO సత్యవేడు
వెంకటరమణ: తొట్టంబేడు TO తిరుమల టూ టౌన్
చిత్రి తరుణ్: శ్రీసిటీ TO పాకాల
తలారి ఓబయ్య: డీసీఆర్బీ TO కేవీబీపురం
మరికొందరి వివరాల కోసం ఇక్కడ<<18637111>> క్లిక్<<>> చేయండి.
News December 22, 2025
నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News December 22, 2025
అన్నమయ్య జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి (M) కరణంవారి పల్లికి చెందిన రాచపల్లి నాగచైతన్య (15) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చౌడేపల్లి జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్న అతడు శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. చదువుపై తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి ఇంటి వరండాలో ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించి వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.


