News March 28, 2025

NRPT: మార్కెట్ యార్డ్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవు

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. ఈనెల 29న అమావాస్య, 30 ఆదివారం సాధారణ సెలవు రోజులు కాగా 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవు కావడంతో వరుసగా నాలుగు రోజులపాటు మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరుపబడవని ప్రకటించారు. యథావిధిగా ఏప్రిల్ 2న బుధవారం మార్కెట్ యార్డులో లావాదేవీలు కొనసాగుతాయన్నారు.

Similar News

News October 30, 2025

ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు: భూపాలపల్లి కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఈ నెల 30న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 9030632608ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంతెనలు దాటవద్దని కోరారు.

News October 30, 2025

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.

News October 30, 2025

మేడారంలో 5 సెంటీమీటర్ల వాన

image

తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వానకు 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో 4.9 సెం.మీ, ఖాసీందేవిపేటలో 4 సెం.మీ, వెంకటాపూర్ 3.8 సెం.మీ, తాడ్వాయి 3.5, గోవిందరావుపేటలో 3.1 సెం.మీ వర్షం కురిసింది. వర్షం ఇలాగే కొనసాగి వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను తెరవాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.