News November 22, 2024
NRPT: ‘మిడ్డే మీల్స్ మెనూ అమలు కావడం లేదు’

నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్డే మీల్స్లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.
Similar News
News September 16, 2025
MBNR: విద్యుత్ స్తంభం ఇలాగే ఉండాలా..?

మహబూబ్నగర్లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ప్రహరీ గోడలో విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. రెండు నెలల క్రితం ప్రచార మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అది అలాగే ఉండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన ఉండాల్సిన విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడలోనే ఉండాలా..? అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్నగర్లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.