News February 4, 2025
NRPT: రాజస్థాన్కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 20, 2025
పాలమూరు:21న సాఫ్ట్ బాల్ ఎంపికలు

మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఈనెల 21న బాల, బాలికలకు సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు సాఫ్ట్ బాల్ అధ్యక్షులు అమరేందర్ రాజు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 24 నుంచి మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు 99590 16610, 99592 20075 లకు సంప్రదించాలన్నారు.
News December 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు
News December 19, 2025
MBNR: సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు

మహబూబ్ నగర్ లోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే ‘ఫుట్ బాల్’ (పురుషుల) జట్ల ఎంపికలను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఉంటాయన్నారు.


