News February 4, 2025
NRPT: రాజస్థాన్కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 19, 2025
మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.
News February 19, 2025
వరంగల్కు నూతన మూల్యాంకన క్యాంపు

వరంగల్ జిల్లా కేంద్రంగా ఇంటర్ నూతన మూల్యాంకన క్యాంపు మంజూరు చేసినట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. గతంలో హన్మకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల ఇంటర్ సిబ్బంది మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో తరగతి గదులు, కార్యాలయం, సౌకర్యాలను పరిశీలించిన పిమ్మట నూతన క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News February 19, 2025
మస్క్: నలుగురితో సంసారం, 13 మంది పిల్లలు

అపరకుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఏకంగా 13 మంది పిల్లలకు తండ్రి అని నేషనల్ మీడియా పేర్కొంది. ఆయన నలుగురితో సంసారం చేయగా, వారికి 13 మంది పిల్లలు కలిగినట్లు తెలిపింది. మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్తో ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్తో ఒక్కరు ఉన్నారు.