News February 4, 2025
NRPT: రాజస్థాన్కు చెందిన వ్యక్తి హత్య

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 8, 2026
MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.
News February 8, 2026
MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.
News February 7, 2026
MBNR: సౌత్ జోన్.. ఈనెల 10న చెస్ ఎంపికలు

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనాఫైడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.


