News March 6, 2025

NRPT: రెండో రోజు పరీక్షలకు 71 మంది గైర్హాజరు

image

నారాయణపేట జిల్లాలో రెండో రోజు గురువారం ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు అయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం 3,803 మంది విద్యార్థులకు గాను, 3,732 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 71 మంది పరీక్షలకు హాజరు కాలేదని చెప్పారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 7, 2025

NRPT: మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం

image

నారాయణపేట పట్టణ ప్రజలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని సింగారం కూడలిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.

News March 7, 2025

గద్వాల: ఏడు మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

image

జోగులాంబ గద్వాల జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. జోగులాంబ గద్వాల జోన్ DIG ఎల్.ఎస్. చౌహన్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ సందర్భంగా DIG ఎల్.ఎస్. చౌహన్ పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

News March 7, 2025

అచ్చంపేటలో యువతి అనుమానాస్పద మృతి

image

ACPTలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఆవుల లక్ష్మి (28) గురువారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఎస్సై రమేష్ వివరాలిలా.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె తెల్లవారుజామున పట్టణంలోని సీతారాలగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. గమనించిన స్థానికులు అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ అన్నారు.

error: Content is protected !!