News April 5, 2025

NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

image

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.

Similar News

News December 20, 2025

క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

image

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.

News December 20, 2025

కొత్త భవనాలకు ‘గ్రీన్ బిల్డింగ్ కోడ్’: విజయానంద్

image

AP: ఇంధన పరిరక్షణ, నెట్ కార్బన్ జీరో లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని CS విజయానంద్ పేర్కొన్నారు. ‘కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫీషియెంట్ ఎక్విప్‌మెంట్ వాడాలనే నిబంధన (Green Building Code)ను తీసుకువచ్చాం. ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ఏర్పాటును ప్రోత్సహించేలా గ్రీన్ ఎనర్జీ పాలసీ పెట్టాం. ఇంధన పొదుపుపై అవగాహనకు స్కూళ్లలో ఎనర్జీ లిటరసీ క్లబ్స్ నెలకొల్పాం’ అని వివరించారు.

News December 20, 2025

సిద్దిపేట: ఆర్డీవో, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీఓ, ఇతర అధికారులందరితో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలో విజయవంతంగా పూర్తి చేశారని, సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కమిషనర్ పంచాయతీ రాజ్ ఆదేశాల మేరకు ఈ నెల 22న నూతన సర్పంచ్ లతో ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు.