News April 5, 2025
NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.
Similar News
News December 12, 2025
కాజీపేటలో 103 చలాన్లు ఉన్న బైక్ సీజ్

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 103 పెండింగ్ చలాన్లు ఉన్న ఒక బైక్ను గుర్తించారు. ఆ వాహనంపై మొత్తం ₹25,105 బకాయిలు ఉండటంతో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఆదేశాల మేరకు ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు కనక చంద్రం, సంపత్ పాల్గొన్నారు.
News December 12, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.


