News April 5, 2025
NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.
Similar News
News April 13, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: అభ్యంతరకర పోస్టులతో వివాహిత మృతి ☞ చిలకలూరిపేట: పీఏసీ సభ్యురాలుగా మాజీమంత్రి విడుదల రజిని.. సత్తెనపల్లి: లారీ కిందపడి వ్యవసాయ కూలి మృతి☞ ఎడ్లపాడు: లింగారావుపాలెం గ్రామంలో నాటిక పోటీలు ☞ నాదెండ్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధం ☞ నూజెండ్ల: మండలంలో వడగండ్ల వాన☞ పిడుగురాళ్ల: బ్రాహ్మణపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం
News April 13, 2025
బూర్జ: రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన విద్యార్థిని

బూర్జ మండలం ఓవిపేట మోడల్ స్కూల్లోఎంపీసీ గ్రూపు సెకండ్ ఇయర్ చదువుతున్న కె.ధరణి శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది. 1000కి 984 మార్కులు రావడంతో ఇంటర్మీడియట్ కార్యదర్శి విద్యార్థినిని సైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును 15న సీఎం చేతులు మీదుగా విజయవాడలో అందుకుంటారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
News April 13, 2025
డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్ కార్పొరేషన్

AP: రాష్ట్రాన్ని డ్రోన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని డ్రోన్ కార్పొరేషన్ తెలిపింది. డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రజలు, పాలనకు ఉపయోగపడేలా డ్రోన్ సేవలు విస్తృతం చేస్తాం. ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 21లోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి కొత్త యూజ్ కేసెస్ను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొంది.