News April 5, 2025
NRPT: ‘రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలి’

లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అధికారులు పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రూ.13 వేల కోట్ల ఖర్చుతో బియ్యం అందిస్తున్నామన్నారు.
Similar News
News January 3, 2026
క్రికెట్ బాల్ తగిలి ఎవరైనా చనిపోతే శిక్షేంటి?.. UPSCలో ప్రశ్న!

సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక లా గ్రాడ్యుయేట్కు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘మీరు కొట్టిన సిక్సర్ వల్ల పార్క్ బయట ఉన్న వ్యక్తికి బాల్ తగిలి అతను చనిపోతే మీ బాధ్యత ఏమిటి?’ అని బోర్డు ప్రశ్నించింది. అభ్యర్థి హాబీ క్రికెట్ కావడంతో ఈ ప్రశ్న అడిగారు. అభ్యర్థుల హాబీలు, నేపథ్యాన్ని బట్టి ప్రశ్నలు వస్తాయని UPSC ట్రైనర్ కేతన్ సర్ వివరించారు. కావాలని గాయపరచలేదు కాబట్టి శిక్ష ఉండదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
News January 3, 2026
HNK: చిన్నారి వినూత్న క్యాలెండర్.. ఒకే పేజీలో 12 నెలలు!

క్యాలెండర్లో సాధారణంగా నెలకు ఒక పేజీ చొప్పున 12 పేజీలు ఉంటాయి. కానీ, హనుమకొండలోని నయీమ్నగర్కు చెందిన చిన్నారి లాస్య సాయి ప్రకాశ్ వినూత్న క్యాలెండర్ను రూపొందించింది. 12 నెలలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే పేజీలో పొందుపరచింది. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన చిన్నారి తండ్రి సత్య ప్రకాష్ సహాయంతోనే ఈ క్యాలెండర్ రూపొందించినట్లు లాస్య తెలిపింది. ఈ చిన్నారి ఐడియా నిజంగా గ్రేట్ కదా! మీ కామెంట్.
News January 3, 2026
వైద్య గ్రంథంలో చోటు దక్కించుకున్న జగిత్యాల డాక్టర్

JGTL పట్టణ వైద్య రంగానికి మరో విశేషం చేరింది. స్థానికంగా సేవలందిస్తున్న ప్రముఖ వైద్యుడు డా.భీమనాతి శంకర్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2026 సం. విడుదలకానున్న వైద్య గ్రంథం మెడిసిన్ అప్డేట్లో ఆయన రచించిన ‘శ్వాసకోశ ఉబ్బసం వ్యాధులు – ఆధునిక చికిత్స పద్ధతులు’ అనే వ్యాసం ప్రచురితమైంది. ఈ వైద్య గ్రంథాన్ని ఈనెల 29న పాట్నాలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫిజీషియన్ల సదస్సులో ఆవిష్కరించనున్నారు.


