News February 27, 2025

NRPT: రైతు అవగాహన సదస్సు.. పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

image

నారాయణపేట పట్టణ శివారులోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఇవాళ మ.1 గంటలకు జరిగే రైతు అవగాహన సదస్సులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్విధ జల ప్రక్రియ ద్వారా పంటల సాగు అనే అంశం పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Similar News

News November 24, 2025

నెల్లూరు: మేయర్ పదవి కలిసిరాలేదేమో…

image

YCP హయాంలో NMC మేయర్‌గా పీఠం ఎక్కిన స్రవంతికి ఆ పదవి అచ్చోచ్చినట్లు లేదు. తమకెవరూ అడ్డురారనే ధీమాతో ఆనాడు మేయర్‌ భర్త జయవర్దన్ కార్పొరేషన్లో చక్రం తిప్పాడు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి జైలు పాలయ్యాడు. తిరిగి కోటంరెడ్డి చెంతకు చేరేందుకు పావులు కదిపినా సఫళీకృతం కాలేదు. అక్కడ్నుంచి మేయర్ అటు YCP, ఇటు TDPల మధ్య రాజకీయ పావుగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

News November 24, 2025

19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

image

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News November 24, 2025

సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఎస్పీ కార్యాలయంలో తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.