News February 27, 2025

NRPT: రైతు అవగాహన సదస్సు.. పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

image

నారాయణపేట పట్టణ శివారులోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఇవాళ మ.1 గంటలకు జరిగే రైతు అవగాహన సదస్సులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్విధ జల ప్రక్రియ ద్వారా పంటల సాగు అనే అంశం పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Similar News

News November 23, 2025

పాడిపశువుల్లో పాలజ్వరం నివారణకు సూచనలు

image

పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్‌ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేతలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్‌, మునగ వంటి ఆకుల్ని కలపడం వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు. పశువులు ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్-డి ఇంజెక్షన్లు, ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు వెటర్నరీ నిపుణుల సూచనతో ఇవ్వాలి.

News November 23, 2025

ఖమ్మం: టెక్నికల్ కోర్సు పరీక్ష ఫీజు గడువు డిసెంబర్ 5

image

2026 విద్యా సంవత్సరంలో నిర్వహించే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) పరీక్షల ఫీజును డిసెంబర్ 5వ తేదీలోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైని శనివారం తెలిపారు. పరీక్ష రుసుము రూ.100గా నిర్ణయించారు. అపరాధ రుసుముతో గడువును పెంచారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చని ఆమె వివరించారు.

News November 23, 2025

సింగరేణి ట్రేడ్ మెన్ వారసుడే భూపాలపల్లి ఎస్పీ

image

సింగరేణి కంపెనీలో బెల్లంపల్లి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సిరిశెట్టి సత్యనారాయణ కుమారుడు సంకీర్త్ భూపాలపల్లి నూతన ఎస్పీగా నియమితులయ్యారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్‌గా పని చేసిన సంకీర్త్, తన ప్రతిభతో సివిల్స్‌లో 330వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్పీగా రావడంతో సింగరేణి ఏరియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.