News January 28, 2025
NRPT: లిఫ్టులో ఇరుక్కున్న ఇద్దరు.. సురక్షితంగా బయటికి

కోర్టులో తమ న్యాయవాదిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు లిఫ్టులో ఇరుక్కున్న ఘటన సోమవారం NRPT కోర్టు భవన సముదాయంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం దుప్పట్ ఘాట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్,అంజయ్య ఓ పని నిమిత్తం కోర్టుకు వచ్చి లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కరెంటు పోయి సుమారు 45 ని,పాటు మధ్యలో ఆగిపోయింది. అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వారు ఇరుక్కున్న వారిని బయటకి తీశారు.
Similar News
News November 16, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగులు

కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా నిరుద్యోగుల పాలిట వరమని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఆదివారం జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు సాగాలని సీఎండీ బలరాం సూచించారు. చదువు ఒకటే మనిషి జీవితాన్ని మారుస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పేరు సాధించాలని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు.
News November 16, 2025
డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్: Dy.CM భట్టి

తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది దుబాయ్ ఫెస్టివల్ను మించేలా ఉంటుందన్నారు. ఈ సమ్మిట్లో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం వంటి వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
News November 16, 2025
TELANGANA NEWS

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి


