News March 9, 2025

NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

image

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 21, 2025

జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

image

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.

News November 21, 2025

వరంగల్ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

image

హనుమకొండలోని ములుగు రోడ్‌లో గల నూతనంగా నిర్మించే వరంగల్ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించారు. డిస్ట్రిక్ట్ స్టోర్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులన్నీ రాబోయే గణతంత్ర దినోత్సవానికి పూర్తి కావాలని, పచ్చదనం, మొక్కలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 21, 2025

విద్యార్థుల సృజనాత్మకతకు అటల్‌ ల్యాబ్‌లు కీలకం: డీఈవో

image

అమలాపురం మండలం పేరూరు జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మూడు రోజుల అటల్‌ ల్యాబ్‌ ఉపాధ్యాయుల వర్క్‌షాప్‌ శుక్రవారంతో ముగిసింది. డీఈవో సలీం బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని కొత్త ఆలోచనలకు ఈ ల్యాబ్‌లు వేదికగా మారాలని ఆకాంక్షించారు. ల్యాబ్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఈవో ఉపాధ్యాయులను హెచ్చరించారు.