News March 9, 2025

NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

image

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 20, 2025

నేడు పల్నాటి వీరుల రాయబారం

image

పల్నాటి వీరుల ఉత్సవాలలో భాగంగా గురువారం “రాయబారం” కార్యక్రమం నిర్వహించనున్నారు. పల్నాటి యుద్ధంలో “రాయబారం” కీలక ఘట్టం. బ్రహ్మనాయుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు అలరాజును గురజాల రాజు నలగామరాజు వద్ద సంధికి రాయబారిగా పంపుతాడు. సందికి వెళ్లిన అలరాజును యుద్ధ నీతిని విస్మరించి ప్రత్యర్థులు చంపుతారు. దీంతో ఆగ్రహించిన బ్రహ్మనాయుడు యుద్ధ ప్రకటన చేయడంతో పల్నాడు యుద్ధానికి అంకురార్పణ జరిగింది.

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.

News November 20, 2025

ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్‌గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.