News March 9, 2025
NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 13, 2025
వరంగల్: మహిళల భద్రత కోసం షీ బాక్స్..!

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వరంగల్ పోలీసు శాఖ మహిళలకు స్ఫూర్తిదాయక పిలుపునిచ్చింది. ఏ మహిళైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి ఘటనను గమనించినా, వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SHe-Box వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.
News November 13, 2025
భూ కబ్జా ఆరోపణలు.. పవన్కు వైసీపీ సవాల్

AP: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.
News November 13, 2025
భద్రాద్రి: డోలీలోనే ప్రసవం.. రోడ్డు లేక గిరిజనుల కష్టం

గ్రామాలు పట్టణాలుగా మారుతున్నా జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. బూర్గంపాడు(M) మోత పట్టి నగర్లోని చింతకుంట గిరిజన గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం దక్కలేదు. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఓ గర్భిణి గ్రామస్థులు కిలోమీటరు డోలీలో మోసుకురావాల్సి వచ్చింది. సకాలంలో 108 వచ్చినా, రోడ్డు అధ్వానంగా ఉండటంతో, ఆమె దారి మధ్యలోనే అంబులెన్స్లో ప్రసవించింది. రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరారు.


