News March 25, 2025
NRPT: వారికి కలెక్టర్ WARNING

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉట్కూరు, కోస్గి, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద మండలాల అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.
Similar News
News October 24, 2025
ప్రైవేట్ బస్సులపై 565 కేసులు: మురళీ మోహన్

తిరుపతిలో శుక్రవారం జిల్లా రవాణా అధికారి కొర్రపాటి మురళీమోహన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై 565 కేసులు నమోదు చేసి రూ.42.95 లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు. పర్మిట్ లేకుండా, పన్ను చెల్లించని వాహనాలపై చర్యలు తీసుకున్నామన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం వేళ వాహనాల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు.
News October 24, 2025
కల్వకుర్తి: బస్సు ప్రమాదం.. యువకుడి సాహసం

కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న కల్వకుర్తి నియోజకవర్గం, మాడ్గుల మండలం చంద్రాయన్పల్లికి చెందిన అశోక్ (బీహెచ్ఈఎల్ ఉద్యోగి) ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన అశోక్.. వెంటనే కిటికీ అద్దాలు పగలగొట్టి అందులోంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు.
News October 24, 2025
భీమదేవరపల్లి: గేదెలను తప్పించబోయి కార్ పల్టీ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న కారు బోల్తా పడింది. రహదారిపై గేదెలు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాటిని తప్పించబోయి కారు పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


