News February 13, 2025
NRPT: ‘విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు’

వేసవికాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ అన్నారు. బుధవారం నారాయణపేట డీఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యత్ సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.
Similar News
News December 4, 2025
పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.
News December 4, 2025
రూపాయి.. ఇంకా కిందికి?

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ₹90ని క్రాస్ చేసింది. 2026 చివరి నాటికి ₹91.5కి చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. FIIలు తిరిగి ఇండియన్ మార్కెట్లో కొనుగోళ్లు చేపడితే డాలర్కు డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుందంటున్నారు. FIIల అమ్మకాలు కొనసాగితే మరింత <<18457079>>క్షీణిస్తుందని<<>> పేర్కొంటున్నారు. చమురు ధరలు పెరిగినా, భారత్-US మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా రూపీ పడిపోతుందని చెబుతున్నారు.
News December 4, 2025
ఏలూరును నాటుసారా రహిత జిల్లాగా చేస్తా: కలెక్టర్

ఏలూరు జిల్లాలో నాటుసారా రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అధికారులతో బుధవారం సమీక్షించారు. సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గతంలో వివిధ శాఖల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందని, తిరిగి నాటు సారా జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


