News February 13, 2025
NRPT: ‘విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు’

వేసవికాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ అన్నారు. బుధవారం నారాయణపేట డీఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యత్ సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.
Similar News
News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో MBA, MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(Y21-24 బ్యాచ్) రెగ్యులర్ & సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 17 నుంచి నిర్వహించనున్నట్లు KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
News March 27, 2025
ఐ.పోలవరం: అత్తింటి వేధింపులు..4 నెలల గర్భిణి సూసైడ్

తాళ్లరేవులోని గండివారిపాలెంలో 4 నెలల గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలోని జి. వేమవరానికి చెందిన ప్రవళ్లిక (21)కు తాళ్లరేవుకు చెందిన రాంబాబుతో ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని నెలలుగా అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో గర్భిణి అయిన తన కుమార్తె ఆత్నహత్య చేసుకుందని విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.