News April 2, 2025
NRPT: సన్న బియ్యంతో అన్నం పెడితే తినడానికి వస్తా: ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలోని అశోక్ నగర్ రేషన్ షాపు 37లో సన్న బియ్యం పంపిణీని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ సన్న బియ్యంతో అన్నం వండి పెడితే తినడానికి వస్తానని మహిళలతో అనడంతో తమ ఇంటికి రావాలని తప్పకుండా పెడతామని మహిళలు ఎమ్మెల్యేకు చెప్పారు.
Similar News
News December 9, 2025
KNR: కట్టింది రెండు గోడలే.. రూ.కోట్లు కొట్టేశారు..!

మానేరు రివర్ ఫ్రంట్లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. పనులు అవ్వకుండానే కాంట్రాక్టర్కు రూ.192CR బిల్లులు చెల్లించడం వివాదాస్పదమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలొస్తున్నాయి. BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.545 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు మానేరుకు ఇరువైపులా కేవలం 2 రిటైనింగ్ వాల్స్ మాత్రమే కట్టారు.
News December 9, 2025
వరంగల్: పేదలను పిండడం.. కేటుగాళ్లకు పెట్టడం!

పేదలు ఆసుపత్రికి వెళ్తే చాలు, గ్రామ స్థాయి నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ముక్కు పిండి గుంజుతున్నారు. సంపాదించిన డబ్బును అక్రమ మార్గాల్లో బినామీ ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. బినామీ ఖాతాల నుంచి రూ.కోట్లు అత్యాశకు వెళ్లి సైబర్ కేటుగాళ్లకు చిక్కి సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఉమ్మడి WGLలో రూ.100కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగినా IT, ED అధికారులు ఎందుకు దృష్టి పెట్టట్లేదని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు.
News December 9, 2025
HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్పేట, ఖైరతాబాద్, అసిఫ్నగర్, హిమాయత్నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చింది.


