News April 8, 2025
NRPT: సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే & కలెక్టర్.

ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్కార్డు లబ్ధిదారులందరు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా నర్వ మండల లంకాల గ్రామ చౌక ధర దుకాణంలో వారు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులందరికి సన్న బియ్యం పంపిణీ వారు ఆదేశించారు.
Similar News
News November 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
News November 22, 2025
కడప: వీరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు

కడప జిల్లాలోని ఇద్దరికి కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించింది. వీరిలో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్కు ఏపీ స్టేట్ షేక్/షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే కడపకు చెందిన యాతగిరి రాంప్రసాద్ను ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు.
News November 22, 2025
ఓపెనర్గా ఫాస్టెస్ట్ సెంచరీ.. వార్నర్ సరసన హెడ్

ENGతో తొలి టెస్టులో 69బంతుల్లోనే సెంచరీ చేసిన AUS ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓపెనర్గా వచ్చి వేగంగా శతకం బాదిన బ్యాటర్గా వార్నర్ సరసన నిలిచారు. 2012లో INDపై వార్నర్ 69బాల్స్లోనే సెంచరీ కొట్టారు. ఇక ఛేజింగ్లో 4వ ఇన్నింగ్స్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా, ఓవరాల్గా ఫాస్టెస్ట్ శతకం బాదిన 8వ బ్యాటర్గా హెడ్ నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో మెక్కల్లమ్ ఉన్నారు. ఆయన AUSపై 54బంతుల్లోనే సెంచరీ కొట్టారు.


