News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News December 21, 2025
‘అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలి’

విశాఖలో అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం విద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అమలు చేయాలని సూచించారు. మంచి అలవాట్లు వలన విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిరోజు పాఠశాల ప్రార్థనా సమయం కంటే ఒక 5 నిముషాలు ముందు అమలు చేయాలని ఆదేశించారు.
News December 21, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★SKLM: రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం
★అంగన్వాడీలకు 5జీ ఫోన్లు అందించిన అచ్చెన్న
★జిల్లా సమగ్ర అభివృద్ధి కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★శ్రీకాకుళం: కొనుగోలు సరే..నగదు సమయానికి చెల్లించేనా ?
★రణస్థలం: గుంతల రోడ్డులో అవస్థల ప్రయాణం
★వైసీపీ వలనే గంజాయి ప్రభావం పెరిగింది: మంత్రి అచ్చెన్న
★సారవకోట: గ్రామాల్లో బెల్టు షాపుల జోరు
News December 21, 2025
పడుకునే ముందు ఇవి తింటే?

లవంగాన్ని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం లేదా నానబెట్టిన నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని అంటున్నారు. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సాయపడుతుందంటున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.


