News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News December 18, 2025
23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.
News December 18, 2025
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
News December 18, 2025
ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


