News January 24, 2025
NRPT: సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,473

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 2,473, కనిష్ఠంగా రూ. 1,940 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. తెల్ల కందులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 8,259, గరిష్ఠంగా రూ. 7,191, ఎర్ర కందులు గరిష్ఠంగా రూ. 7,811, కనిష్ఠంగా రూ. 5,600, వేరు శనగ గరిష్ఠంగా రూ. 5,940, కనిష్ఠంగా రూ. 3,089 ధర పలికిందని చెప్పారు.
Similar News
News January 8, 2026
సిద్దిపేట: ఉక్కుపాదం మోపిన CP

గతేడాది Oct 6న సిద్దిపేట CPగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ తన మార్కును చూపించారు. అక్రమ ఇసుక, గంజాయి, డ్రగ్స్ రవాణ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారిపై ఉక్కుపాదం మోపారని జిల్లా వాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన మందుబాబులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.10 వేల జరిమాన, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టారు.
News January 8, 2026
మైనర్ షూటర్కు లైంగిక వేధింపులు.. బెడ్పైకి లాక్కెళ్లి..

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్పై లైంగిక వేధింపుల <<18795742>>కేసులో<<>> బాధితురాలు(మైనర్) కీలక విషయాలు వెల్లడించారు. ‘గేమ్ అనాలసిస్ పేరుతో 5స్టార్ హోటల్కు పిలిచాడు. కుర్చీలో కూర్చున్న నన్ను బలవంతంగా బెడ్పైకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. నేను ప్రతిఘటించడంతో కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించాడు. పైగా తనతో బాగా నడుచుకోవాలన్నాడు. జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పడంతో PSకు తీసుకొచ్చింది’ అని తెలిపారు.
News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.


