News March 18, 2025
NRPT: సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే

నారాయణపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. కోయిలకొండలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు, దన్వాడ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరారు. మరికల్కు జూనియర్ కలశాల శాంక్షన్ చేయాలని చెప్పారు. నారాయణపేట పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలకు, అభ్యసన ఉన్నత పాఠశాలకు నూతన భవనాలు మంజూరు చేయాలని అన్నారు.
Similar News
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
News November 18, 2025
ఖమ్మం: సింగరేణి జాబ్ మేళా.. 13,867 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సింగరేణి సంస్థ నిర్వహించిన జాబ్ మేళా అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహించిన మేళాల ద్వారా ఉమ్మడి జిల్లాలో 13,867 మందికి ఉద్యోగాలు లభించాయి. వేలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో, సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని CMD బలరాంనాయక్ పిలుపునిచ్చారు.
News November 18, 2025
నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళా

నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళాలు నిలుస్తున్నాయి. సింగరేణి ప్రాంత యువతీ, యువకుల కోసం హైదరాబాద్కు చెందిన పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పెట్టి వేలాది యువతకు కొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3500 మంది అభ్యర్థులు పాల్గొనగా.. 2,000 మందికి ఉపాధి లభించింది.


