News February 22, 2025
NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.
Similar News
News February 25, 2026
రేపటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: సాలకట్ల తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబైంది. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రేపు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నట్లు TTD అధికారులు తెలిపారు. మార్చి 2 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ సహా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.
News February 25, 2026
పెద్దపల్లి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి మహా పుష్కరాలు జరుగుతాయన్నారు. జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి త్వరగా సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News February 25, 2026
NGKL: ఐదు రోజుల శిక్షణను పూర్తి

నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఐదు రోజులుగా జిల్లా కేంద్రంలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. సర్పంచుల విధులు, బాధ్యతలపై ఐదు రోజులుగా సర్పంచులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న గాజర సర్పంచ్ శ్రీపతిరావు బుధవారం అడిషనల్ కలెక్టర్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన అన్నారు.


