News February 22, 2025
NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.
Similar News
News December 10, 2025
NZB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్(ఫొటోతో), రేషన్ కార్డు(ఫొటోతో), పట్టాదారు పాస్బుక్, ఉపాధి జాబ్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), పెన్షన్ తదితర పత్రాల్లో ఏదోకటి చూపించాలి.
News December 10, 2025
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.
News December 10, 2025
MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

మహబూబ్నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


