News October 4, 2024
NRPT: ‘సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త’
దసరా సెలవులకు వేరే వుళ్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయాలని, ఇళ్లలో విలువైన ఆభరణాలు, డబ్బులు వుంచారదని, ఇంటి బయట 24 గంటలు లైట్లు వెలిగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో దొంగలు చేతివాటం చూపుతారని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అన్నారు.
Similar News
News October 4, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటరు తుది జాబితా
స్థానిక ఎన్నికల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 23,22,054 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,54,128 మంది ఉండగా..11,67,893 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13,765 మంది అధికంగా ఉన్నారు.
1.మహబూబ్ నగర్- 5,16,183
2.నాగర్ కర్నూల్- 6,46,407
3.నారాయణపేట- 4,03,748
4.గద్వాల్- 3,88,195
5.వనపర్తి- 3,67,521
News October 4, 2024
కొడంగల్: యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు
కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో సోషల్ స్టడీస్లో 2వ ర్యాంక్, VKB జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అదే విధంగా ఇటీవలే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగంతో సత్తా చాటాడు. 4 ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.
News October 4, 2024
ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి,వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.