News February 2, 2025
NRPT: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

అధునాతన టెక్నాలజీని వాడుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్పై స్పందించొద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 24, 2025
32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News November 24, 2025
రేపు GHMC పాలకమండలి సమావేశం!

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
News November 24, 2025
ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.


