News March 1, 2025
NRPT: స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీత పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట మండల పరిధిలోని లింగంపల్లి శివారు సర్వే నంబర్ 30లో ఉన్న 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన పాఠశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.200 కోట్లతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News March 27, 2025
సిద్దిపేట: ‘సెర్ఫ్ లక్ష్యాలను చేరుకోవాలి’

సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
News March 27, 2025
ఉప్పల్లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
News March 27, 2025
డీప్ ఫేక్పై నటి, ఎంపీ ఆందోళన

డీప్ ఫేక్పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.