News March 15, 2025
NRPT: ‘హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలి’

వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తువుల వినియోగం తప్పనిసరి అని అన్నారు. వాటిని కొనుగోలు చేసిన సందర్భంలో నకిలీ వస్తువులుగా గుర్తిస్తే విక్రయించిన వారిపై ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 4, 2026
ఇంద్రవెల్లి: పాముకాటుతో బాలుడి మృతి

ఇంద్రవెల్లి మండలం సకారాం తాండకు చెందిన దయారాం భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు విశ్వనాథ్ (4) పాము కాటుతో మృతి చెందాడు. శుక్రవారం పిల్లలతో కలిసి రేగి పండ్లు చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తింటున్న సమయంలో పాము కాటేసింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 4, 2026
పాక్ తరహాలోనే బంగ్లాతోనూ క్రికెట్ కష్టమే!

పాక్ తరహాలోనే బంగ్లాదేశ్తోనూ భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులే దానికి కారణం. SEPలో భారత్ తమ దేశంలో పర్యటిస్తుందని BCB ప్రకటించింది. కానీ BCCI దానిని కన్ఫామ్ చేయలేదు. పైగా IPL నుంచి బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్ను తప్పించారు. దీంతో బంగ్లా కూడా T20WC మ్యాచులు భారత్లో ఆడకూడదని, తమ వేదికలు మార్చాలని ICCని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2026
జనవరి 4: చరిత్రలో ఈరోజు

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం


