News March 13, 2025
NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 86 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి దర్శనం వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 3,527 మందికి, 3460 మంది హాజరుకాగా, 67 మంది గై హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 547 మందికి 528 మంది పరీక్షలకు హాజరయ్యారు. 19 మంది గై హాజరైనట్లు తెలిపారు. వివిధ మండలాలను ప్లేయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
Similar News
News March 13, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన పెగడపల్లి మండల వాసి

పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన గాలిపెల్లి రాజమౌళి- అనూష కుమార్తె గాలిపెల్లి స్నేహ ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 517 మార్కులతో రాష్ట్రస్థాయి 485వ ర్యాంకు సాధించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఆమె తండ్రి స్వర్ణకార వృత్తి చేస్తుండగా తల్లి కుట్టు మిషన్ కుడుతుంది.
News March 13, 2025
పెబ్బేరు: దరఖాస్తు గడువు పెంపు: నరేష్ కుమార్

పెబ్బేరు ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఇంటర్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందన్నారు.
News March 13, 2025
VZM: కేంద్ర మంత్రితో ఎంపీ కలిశెట్టి భేటీ

ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.