News March 8, 2025

NRPT: ఇంటర్ పరీక్షకు 4553 మంది హాజరు

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 4553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం విద్యార్థులు 4702 కాగా, వారిలో 149 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారని చెప్పారు. మరికల్, మక్తల్ గురుకుల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారని చెప్పారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.

Similar News

News February 22, 2026

నెయ్యి నాణ్యత పరిశీలనకు ఫ్రాన్స్ నుంచి మెషీన్: మంత్రి సత్యకుమార్

image

AP: తిరుమలలో రూ.25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీని మార్చిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. స్వామి వారి ప్రసాదాలతోపాటు వాటి తయారీకి ఉపయోగించే ముడిసరకుల నాణ్యతను పరీక్షిస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యతలో అత్యంత స్వల్పస్థాయిలో లోపం ఉన్నా గుర్తించేందుకు ఫ్రాన్స్ నుంచి ‘ఈ టంగ్-ఈ నోస్’ పరికరాన్ని తీసుకొస్తున్నామన్నారు. దీని విలువ రూ.3.5 కోట్లని తెలిపారు.

News February 22, 2026

కమ్మర్ పల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

image

కమ్మర్ పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎక్స్‌ఎల్‌పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి కుమార్తె వసంత ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2026

FDకి ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

image

FDకి స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ బ్యాంక్ ఐదేళ్ల టెన్యూర్‌కు 7.90%, ఉజ్జీవన్ బ్యాంక్ రెండేళ్లకు 7.45% ఇంట్రెస్ట్ అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో SBM Bank (18 నెలల నుంచి 2years 3days) టెన్యూర్‌కు 7.30% వడ్డీ ఇస్తోంది. RBL Bank 7% (18M to 3Y) అందిస్తోంది. పబ్లిక్ సెక్టార్‌లో పంజాబ్ & సింధ్ 6.75% (666 రోజులు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70% (450 రోజులు) హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి.