News February 21, 2025

NRPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడంతో పాటు రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించిన CJI

image

అమరావతిలో నిర్మించిన జడ్జిల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్‌ను ఆదివారం CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. నిర్మాణం పూర్తైన జడ్జిల బంగ్లాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం CJI పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారాన్ని అధికారులు CJI, న్యాయమూర్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

News March 1, 2026

2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

image

AP: కూటమి ప్రభుత్వం బెదిరింపులకు YCP భయపడదని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ‘అంబటి ఎప్పుడూ ఎవరినీ దూషించలేదు. TDP నేతలు కావాలనే ఆయన్ను రెచ్చగొట్టారు. రాంబాబు క్షమాపణలు చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేశారు. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి YCP భయపడదు. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేశ్‌కే ఇబ్బంది’ అని హెచ్చరించారు.

News March 1, 2026

సంజూ హాఫ్ సెంచరీ

image

T20WC: కీలక మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.