News February 18, 2025

NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

image

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Similar News

News December 23, 2025

‘యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా’

image

జగిత్యాల పట్టణ ప్రజల డిమాండైన యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతానని MLA సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. CMను కలసి యావర్ రోడ్డు విస్తరణపై చర్చించామన్నారు. 100ఫీట్ల వెడల్పుతో కమర్షియల్ జోన్‌గా మార్చిన నేపథ్యంలో విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరగా CM వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం నిర్మాణానికి హామీ లభించిందన్నారు.

News December 23, 2025

BREAKING: మాజీ MP ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్ట్

image

మాజీ MP DK ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను CBI అధికారులు సోమవారం అరెస్టు చేశారు. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో అరెస్టు చేసినట్లు సమాచారం. 2019 మే 4వ తేదీన అనుమానాస్పద రీతిలో రఘునాథ్ మృతిచెందాడు. దీంతో రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి వాటిపై CBI కేసు నమోదు చేసింది.

News December 23, 2025

KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్‌కు ‘టీటీయూ’ వినతి

image

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.