News January 22, 2025
NRPT: జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో సమావేశంలో SP యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది 250 వరకు రోడ్డు ప్రమాదాలు జరగాయని, అందులో 102 మంది చనిపోయారన్నారు. సమన్వయంతో ప్రమాదాలు నివారించాలన్నారు.
Similar News
News January 6, 2026
‘రాజాసాబ్’ రన్ టైమ్ ఫిక్స్.. టికెట్ ధరలు పెరిగేనా?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా పేర్కొంది. మరోవైపు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. దీనిపై <<18543073>>TG ప్రభుత్వం<<>> ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 6, 2026
ఆన్లైన్లో కుల ధ్రువీకరణ పత్రాల నిక్షిప్తం: కలెక్టర్

ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,94,172 మంది వివరాలను సుమోటోగా విచారించి ప్రభుత్వ వెబ్సైట్లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. వీటిలో 3,25,834 మంది పత్రాల విచారణ పూర్తవగానే ఆమోదముద్ర వేశామన్నారు. భవిష్యత్తులో ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <


