News February 4, 2026

NRPT: ‘టీజీ-ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు’

image

టీజీ-ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల వద్ద దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 50 పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు గాను 36 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని అధికారులు వివరించారు.

Similar News

News February 21, 2026

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి SP

image

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News February 21, 2026

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

image

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

బాన్సువాడ అల్లర్లు.. 12 మంది ARREST

image

బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ హెచ్చరించారు.