News July 7, 2025

NRPT: తగ్గిన సర్పంచ్, MPTC స్థానాలు

image

నారాయణపేట జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో సర్పంచ్, MPTC స్థానాలు తగ్గాయి. ప్రభుత్వం పలు గ్రామాలను విలీనం చేస్తూ కొత్తగా మద్దూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 280 సర్పంచ్ స్థానాలు నుంచి 272, ఎంపీటీసీ స్థానాలు 140 నుంచి 136 కు చేరుకున్నాయి. వీటితోపాటు 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

Similar News

News July 7, 2025

నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.

News July 7, 2025

కామారెడ్డి నుంచి పుణ్యక్షేత్రాల టూర్‌కు ప్రత్యేక బస్సులు

image

కామారెడ్డి డిపో నుంచి వారాంతాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక డీలక్స్ బస్సు సేవలను TGSRTC ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సులు కొమురవెల్లి, వరంగల్, చిలుకూరు బాలాజీ, దామగుండం, అనంతగిరి, కోటిపల్లి ప్రముఖ దైవక్షేత్రాలకు చేరవేస్తాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

News July 7, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 117 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.