News March 30, 2025
NRPT: తెల్లవారుజాము నుంచే పెరిగిన పండుగ రద్దీ

ఉగాది, రంజాన్ వరుస పండుగలు రావడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే జిల్లాకు వచ్చే వారితో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు ఇవ్వడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు బస్ సర్వీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు బస్ డిపో అధికారులు వివరించారు.
Similar News
News July 5, 2025
జగిత్యాల: EVM గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు EVM గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. EVM భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ తహశీల్దార్ తదితరులున్నారు.
News July 5, 2025
ఇందిరమ్మ ఇంటిని త్వరగా పూర్తిచేస్తే బిల్లులు వస్తాయి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2వ దశలో పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతికి సంబంధించి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్యతో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు వస్తాయని తెలిపారు.
News July 5, 2025
ఐశ్వర్యరాయ్తో విడాకులపై స్పందించిన అభిషేక్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ పరోక్షంగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు మేము అంతగా ప్రాధాన్యత ఇవ్వం. ఇలాంటి వార్తలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా భార్య, తల్లి కూడా బయట జరిగే విషయాలు ఇంట్లోకి తీసుకురారు. ప్రస్తుతం మా కుటుంబమంతా కలిసి హ్యాపీగా జీవిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.