News October 25, 2025
NRPT: ధన ధాన్య పథకం రైతులకు వరం: దత్తాత్రేయ

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధినే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. దేశంలోని 100 వెనుకబడిన జిల్లాల్లో “ధన ధాన్య” కార్యక్రమం ప్రారంభించామని, అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మూడు జిల్లాలు ఎంపికయ్యాయని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News October 26, 2025
MBNR: BRS విజయం.. అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

HYDలోని MTAR Technologies Ltd కంపెనీలో భారత రాష్ట్ర సమితి నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పై గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
News October 26, 2025
అసలైన భక్తులు ఎవరంటే?

లాభాపేక్షతో భగవంతుణ్ని సేవించేవారు వ్యాపారస్తులు అవుతారు. వారు దేవుణ్ని తన వ్యాపార భాగస్వామిగా భావించి, ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కానీ నిజమైన భక్తులు ఎలాంటి స్వార్థం, ఆశయం లేకుండా ‘నేనే నీ దాసుడను, నీవు నా స్వామివి’ అనే నిష్కల్మష భావనతో సేవలు చేస్తారు. ప్రతిఫలం ఆశించకుండా, మనస్సును భగవంతునిపైనే ఉంచి భక్తి చూపుతారు. స్వామి సంతోషమే తన సంతోషంగా భావించి, అందరిలోనూ ఆనందాన్ని నింపుతారు. <<-se>>#Daivam<<>>
News October 26, 2025
భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>


