News April 24, 2025
NRPT: ‘నకిలీ విత్తనాల అమ్మితే కఠినమైన చర్యలు’

నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఊళ్లల్లోకి ప్యాకెట్లలో కాకుండా లూసుగా విత్తనాలు తీసుకొస్తే రైతులు తీసుకోవద్దని ఎస్పీ రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాపుల్లో ప్యాకింగ్ లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుక్కోవాలని రైతులను ఎస్పీ సూచించారు.
Similar News
News April 24, 2025
భగ్గుమంటున్న నిజామాబాద్.. జర జాగ్రత్త

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
News April 24, 2025
తిరుపతి: బాలికపై అత్యాచారం

తిరుపతిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు CI మురళీ మోహన్ తెలిపారు. చెర్లోపల్లికి చెందిన రవి కుమార్, సాయి స్నేహితులు. వారికి తిరుపతికి చెందిన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఉంది. ఆమె సాయితో వెళ్లిపోయింది. చెర్లోపల్లి వద్ద నిందితులు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.
News April 24, 2025
భగ్గుమంటున్న కామారెడ్డి.. జర జాగ్రత్త!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.