News August 12, 2024
NRPT: నేడు పాఠశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ నిర్వహించాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిజ్ఞ చేసిన చిత్రాలు, వీడియోలను విద్యాశాఖ అధికారులకు పంపించాలని, https:// nmba.dosje.gov.in/pledge-certificate ద్వారా ధృవపత్రం పొందాలన్నారు.
Similar News
News October 1, 2024
MBNR: DSC ఫలితాలు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇక్కడే..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC 1:3 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. MBNR-243 పోస్టులకు గాను 729 అభ్యర్థులు(మెట్టుగడ్డలోని డైట్ కళాశాలలో), NGKL-285 పోస్టులు(885)(లిటిల్ ఫ్లవర్ పాఠశాల), NRPT-279 పోస్టులు(837) (MLA క్యాంప్ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ హాస్టల్), GDWL-172 పోస్టులు (516)(ZPHS బాలుర స్కూల్), WNPT-152 పోస్టులు(456)(బాలికల ఉన్నత పాఠశాల) సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.
News October 1, 2024
యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్
యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
News September 30, 2024
NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.