News February 19, 2025

NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.

Similar News

News March 12, 2025

GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

image

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2025

MBNR: యాసంగి పంటలను పరిశీలించిన కలెక్టర్

image

ఈ వేసవిలో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వారికి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులు ఆదేశించారు. కోయిలకొండ మండల పరిధిలోని సంగనోని పల్లి సేరి వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేసవి పంటలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండలకు నీటి జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించారు.

News March 11, 2025

MBNR: విద్యార్థుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కోయిలకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థులుకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ రుచిచూసి భోజనంపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ దృష్టికి వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.

error: Content is protected !!