News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమర్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
Similar News
News February 22, 2026
VZM: మర్డర్ చేసి పారిపోయిన దొంగ అరెస్ట్?

విశాఖలోని ఆరిలోవలో ఈ నెల 11వ తేదీన మహిళను <<19117161>>హత్య<<>> చేసి ఇంట్లో 10 తులాల బంగారు, రూ.5 లక్షలు డబ్బుతో పరారైన ముసుగు దొంగను ఆరిలోవ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బొబ్బిలి ప్రాంతానికి చెందిన శివ మృతురాలు లక్ష్మితో పరిచయం ఉండేది.వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ముసుగు వేసుకొని ఇంటికి వచ్చి ఆమెను హత్య చేసి నగలు, డబ్బు పట్టుకొని పరారైపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
News February 22, 2026
కామారెడ్డి, బాన్సువాడలో 163 సెక్షన్: SP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం నిషేధమని హెచ్చరించారు. అయితే, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పోలీసు విధి నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
News February 22, 2026
మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ని పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.


