News March 14, 2025

NRPT: ‘పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 19లోపు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితాలో సవరణలు చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు.

Similar News

News September 14, 2025

కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

image

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.

News September 14, 2025

JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్‌ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News September 14, 2025

అనంతపురంలో కిలో టమాటా ధర రూ.17

image

అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో గరిష్ఠ ధర రూ.17, కనిష్ఠ ధర రూ.8 ఉంది. సరాసరి రూ.12 ప్రకారం క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే రైతులు పెద్దమొత్తంలో టమాటాను మార్కెట్‌కు తీసుకొచ్చారని పేర్కొన్నారు.