News March 26, 2025

NRPT: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష

image

నారాయణపేట మండలానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసిన ఘటనలో HYD బుద్వేల్ ప్రాంతానికి చెందిన వేముల అభిలాష్ అనే నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష, రూ.60 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చ్‌ 2న అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.

Similar News

News March 28, 2025

RCBతో మ్యాచ్.. CSK 26/3

image

RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ రుతురాజ్ 0, దీపక్ హుడా 4 పరుగులకే ఔటయ్యారు. జోస్ హేజిల్‌వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చేశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశారు. క్రీజులో రచిన్ 16, కర్రన్ 0 ఉన్నారు.

News March 28, 2025

కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

image

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.

News March 28, 2025

కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

image

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల

error: Content is protected !!