News March 11, 2025
NRPT: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇస్తూ వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
నిర్మల్: కార్డులు సరే.. పథకాలు ఏవి?

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ మినహా ఇతర ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ప్రజాపాలన వెబ్ సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆప్షన్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.


