News April 15, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.
Similar News
News February 15, 2026
అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్: CM

TG: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని CM రేవంత్ తెలిపారు. HYDలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘4నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నా. ఈ ప్రస్థానంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారు. భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించకూడదు. బాగా చదువుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.
News February 15, 2026
MNCL: కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

కార్పొరేషన్ రాజకీయాల్లో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టారు. MNCL 23వ డివిజన్ కార్పొరేటర్ శంకర్, 45వ డివిజన్ సునీత, 47వ డివిజన్ సాయికృష్ణ ఆదివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చేరికను వారు స్వయంగా ధ్రువీకరించారు. వీరితో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా త్వరలో హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
News February 15, 2026
భద్రాద్రి: పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

మహాశివరాత్రి పర్వదినాన మణుగూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టు ఉడతనేని గుంపు ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుప సుదీర్(21) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పండుగ పూట చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.


