News January 26, 2025

NRPT: ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

image

నారాయణపేటలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో దామరగిద్ద మండలం మొగల్ మడ్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మహేశ్ ద్వితీయ స్థానంలో నిలిచారని పాఠశాల హెచ్ఎం కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో మొగల్ మడ్క విద్యార్థి ప్రతిభ చూపడం పట్ల పలువురు అభినందించారు.

Similar News

News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.

News March 13, 2025

‘వైసీపీ ఉనికి కోసమే యువత పోరు చేపట్టింది’

image

నంద్యాల: రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కేవలం ఉనికి కోసమే యువత పోరు కార్యక్రమం చేపట్టిందని యూనివర్సల్ స్టూడెంట్ యూత్ యూనియన్ అధ్యక్షుడు ముద్దం నాగ నవీన్ మండిపడ్డారు. యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి.. ఇప్పుడు ఫీజు పోరు చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2025

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

image

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.

error: Content is protected !!