News October 13, 2025

NRPT: ఫిర్యాదులు చట్టం ప్రకారం పరిష్కరించాలి

image

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను చట్టం ప్రకారం పరిష్కరించాలని ఎస్పీ వినీత్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పరు. మొత్తం నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు.

Similar News

News October 14, 2025

LOC వెంబడి ఉగ్రమూక చొరబాటు యత్నం!

image

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని అనుమానాస్పద కదలికలను భారత ఆర్మీ గుర్తించింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అటుగా జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ వైపు నుంచి సరిహద్దు దాటే ప్రయత్నం జరిగినట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

News October 14, 2025

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News October 14, 2025

రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

image

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.