News October 27, 2025

NRPT: మద్యం షాపుల లక్కీ డ్రా పూర్తి.. 34 దుకాణాలకు లైసెన్స్‌లు

image

మద్యం పాలసీ 2025–27కు సంబంధించి మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 34 మందికి లైసెన్స్‌లు మంజూరయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారని ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. కొత్త లైసెన్స్‌లు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

ఖమ్మంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

image

ఖమ్మం జిల్లాలో 116 ఏ4 మద్యం షాపుల కేటాయింపును లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 4,430 దరఖాస్తులు అందగా, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. రిజర్వేషన్ ప్రకారం గౌడలకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 27, 2025

చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం

image

చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మున్సిపల్ కమిషనర్ రషీద్ ఆర్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చర్చించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News October 27, 2025

ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

image

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.